అఫ్ఘాన్లో తాలిబన్లు మరోసారి తమ క్రూరత్వాన్ని బయటపెట్టారు. దొంగతనం చేశారన్న నెపంతో నలుగురు వ్యక్తులను అత్యంత దారుణంగా.. వందలాది మంది చూస్తుండగా చేతులు నరికివేశారు. కాందహార్లోని అహ్మద్షాహి స్టేడియంలో తాలిబన్లు ఈ చర్యకు పాల్పడ్డారు. అదేవిధంగా, వివిధ నేరాల కింద ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో తొమ్మిది మందిని బహిరంగంగా కొరడాతో కొట్టి శిక్షించారు. నిందితులను 35 నుంచి 39 సార్లు కొరడాలతో కొట్టి శిక్షించినట్లు అక్కడ అధికార ప్రతినిధి హజీ జైద్ తెలిపారు.
The Taliban have reportedly cut off the hands of 4 people in a football stadium in Kandahar today, accused of theft, in front of spectators.
People are being lashed, amputated & executed in Afghanistan, without fair trial and due process.
This is a human rights violation. pic.twitter.com/vLcjCOTOM5
— Shabnam Nasimi (@NasimiShabnam) January 17, 2023
కాగా, శిక్ష అమలు చేస్తున్న సమయంలో స్టేడియంలో నిందితుల ఫొటోలను ఆఫ్ఘనిస్థాన్ రీసెటిల్మెంట్, రిఫ్యూజీ మంత్రిత్వశాఖ మాజీ సలహాదారు షబ్నమ్ నాసిమి ట్విట్టర్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. తప్పు చేసిన వారికి షరియా చట్టం ప్రకారం.. బహిరంగంగా శిక్ష విధించారు. ఇప్పటికే మహిళల చదువులపై ఆంక్షలు విధిస్తూ.. సాటి మనుషులపై కర్కశంగా ప్రవర్తిస్తున్నారు. 2021లో పౌర ప్రభుత్వాన్ని కూల్చి అధికారాన్ని చేజిక్కించుకున్న తాలిబన్లు.. గత ఏడాది డిసెంబర్లో మొదటిసారి బహిరంగ ఉరిశిక్షను అమలు చేశారు.