telangana rural people still fallowing Superstitions
mictv telugu

మగవాడికి శీలపరీక్ష..కాలిందా లేదా..

March 3, 2023

 

telangana rural people still fallowing Superstitions

ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా ఇంకా రాముడి కాలం నాటి ఆలోచనలు ప్రజల్లో పోలేదు. ఆనాడు రాముడు సీతను అనుమానిస్తే సీత తన శీలపరీక్ష కోసం అగ్నిప్రవేశం చేసింది. ఈ కలియుగంలో తాను ఏ తప్పుచేయలేదని చెప్పినా కూడా ఊరి పెద్దలు ఓ పురుషుడికి శీలపరీక్ష కోసం అగ్నిపరీక్ష నిర్వహించారు. ఈ ఘటన మరెక్కడో కాదు తెలంగాణలోని ములుగు జిల్లాలో చోటు చేసుకుంది. ఎర్రగా కాలిన బొగ్గుల నుంచి గడ్డపారను తీసి తాను శీలవతుడనని నిరూపించుకోవాలని గ్రామ పెద్దలు ఆదేశించారు . ఈ పరీక్షకు ఒప్పుకున్న సదరు వ్యక్తి వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.

కాలం మారుతున్నా ఇంకా మారుమూల పల్లెల్లో మూఢనమ్మకాలు పోలేదు అనడానికి ఈ సంఘటన ఓ ఉదాహరణగా నిలుస్తుంది. ములుగు జిల్లా, ములుగు మండలం జంగాలపల్లి సమీపంలోని బంజర్ పల్లి గ్రామానికి చెందిన జగన్నాథం గంగాధర్ అనే వ్యక్తి తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని పెద్దమనుషుల పంచాయితీ పెట్టించాడు అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి. అయితే తనకు ఆమె ఎలాంటి సంబంధం లేదని గంగాధర్ నెత్తినోరూ బాదుకున్నా గ్రామ పెద్దలు వినలేదు. నీకు ఎలాంటి సంబంధం లేకపోతే శీలపరీక్షకు సిద్ధమేనా అని ప్రశ్నించారు. దీంతో సదరు వ్యక్తం చేసేదేమీ లేక చివరకు అంగీకరించాడు. అయితే అగ్ని పరీక్షలో ఈ కలియుగ రాముడు నెగ్గినా నీవు తప్పుచేశావంటూ నిందించారు. దీంతో ఆగ్రహించిన గంగాధర్ పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయాన్ని చెప్పాడు. ఈ వార్త ఆ నోట ఈ నోట పడి నెట్టింట్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఫిబ్రవరి 25న ఈ సంఘటన చోటుచేసుకుంది. పెద్దమనుషులు చెప్పినట్లు గంగాధర్ సరస్సులో స్నానం చేసి అగ్ని గుండం చుట్టూ 3 సార్లు తిరిగి నిప్పుల్లో ఉన్న గడ్డపారను తీశాడు. అతడికి ఎలాంటి గాయాలు కాలేదు. ఈ పరీక్షలో గాయాలైతే తప్పుచేసినట్లు కాకపోతే చేయనట్లు అని పంచాయితీ తీర్మానించింది. మరో విషయం ఏమిటంటే ఈ పరీక్షలో నెగ్గిన వారికి ఓడినవారు డబ్బులు చెల్లించారు.దీంతో గంగాధర్ తనకు డబ్బులు ఇప్పించాలని కోరగా సదరు పంచాయితీ పెద్దలు గాయాలు అయ్యాయని తప్పు ఒప్పుకోవాలని ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలో సదరు బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసుకులు కేసు నమెదు చేసి విచారణ చేప్టారు.