ప్రముఖ సెర్చింజన్ గూగుల్కు భారత్లోని ‘కాంపిటీషన్ కమీషన్ ఆఫ్ ఇండియా’ రూ.136 కోట్ల జరిమానా వేసింది. గూగుల్కు చెందిన ఆల్ఫాబెల్ కంపెనీ వెబ్సెర్చ్లో, అడ్వర్టెయిజ్మెంట్స్లో పైచేయికోసం ప్రయత్నించింది.
ఆ సంస్థ అలా చేయడంవల్ల ఇతర పోటీ సంస్థలు,యూజర్లు భారీగా నష్టపోయాయని భారత్ స్పష్టం చేసింది. అందుకోసమే గూగుల్కు కాంపిటీషన్ కమీషన్ ఆఫ్ ఇండియా(CCI) రూ.135.86 కోట్ల జరిమానా విధిస్తున్నట్లు తెలిపింది. 60 రోజుల్లోగా గూగుల్ జరిమానాను చెల్లించాల్సి వుంటుందని సీసీఐ చెప్పింది