సుడి తిరగాలి గానీ బిచ్చగాడు కూడా బిలీనియర్ అవుతాడు అనడానికి పేటీఎం ఆఫీస్ బాయే ఉదాహరణ. అప్పటి వరకు పేటీయంలో వాళ్ళంతా సాధారణ నెలసరి జీతగాళ్ళు. కాలం కలిసొచ్చింది. కంపెనీయే కాదు అందులో పనిచేసే వాళ్ళంతా లక్షాధికారులు, కోటీశ్వరులయ్యారు. చివరికి అందులో పనిచేసే ఆఫీస్ బాయ్ కూడా రూ. 20 లక్షలు పొంది చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేశాడు.డిజిటల్ లావాదేవీల్లో శరవేగంగా దూసుకెళ్తున్న పేటీఎం ఇటీవల ప్రకటించిన రెండో స్టాక్ విక్రయంతో, 100కు పైగా ఆ కంపెనీ ఉద్యోగులు మిలీనియర్లుగా మారిన సంగతి తెలిసిందే. సుమారు రూ. 500 కోట్ల విలువైన స్టాక్ సేల్ను ఈ కంపెనీ చేపట్టింది. కాగా ఉద్యోగులు తమకున్న వాటాను ఈసాప్స్ విక్రయించుకున్నారు. ఉద్యోగులు సొంతంగా షేర్లను కలిగి ఉండటానికి అనుమతించే ఆర్థిక సాధనమే ఈసాప్స్. కొంత కాలం తర్వాత ఈ షేర్లను అమ్మి, నగదుగా మార్చుకోవచ్చు.
సరిగ్గా ఇక్కడే పేటీఎం దశ మారిపోయింది. ఈ విక్రయం ద్వారా పేటీఎం చీఫ్ ఎక్జిక్యూటివ్ హరిందర్ థాకర్ రూ. 40 కోట్లను ఆర్జించారు. ఈ స్టాక్ విక్రయంతో తమ కంపెనీకి చెందిన ఉద్యోగులే కాదు ఆఫీసు బాయ్ కూడా రూ.20 లక్షలకు పైగా ఆర్జించినట్టు వన్97 కమ్యూనికేషన్ లిమిటెడ్ సోమవారం రిపోర్టు చేసింది. ఉద్యోగుల వివరాలను బయటకు చెప్పనప్పటికీ ఆఫీస్ బాయ్ వివరాలను బహిర్గతం చేసింది కెనడా చీఫ్ ఎగ్జిక్యూటివ్. కంపెనీ ఈసాప్స్ కేవలం టాప్, మిడ్ లెవల్ ఎగ్జిక్యూటివ్లకు మాత్రమే కాకుండా.. ముందు నుంచి కంపెనీలో పనిచేసిన ఉద్యోగులకు, ఆఫీసు స్టాఫ్కు కూడా కంపెనీ అందించింది.
పేటీఎం ప్రస్తుత ఇన్వెస్టర్లుగా సాఫ్ట్బ్యాంకు, ఎస్ఏఐఎఫ్ పార్టనర్స్, అలీబాబా గ్రూప్ హోల్డింగ్ లిమిటెడ్, యాంట్ ఫైనాన్సియల్ సర్వీసెస్ గ్రూప్లు ఉన్నాయి.