ఇండోర్లో ఓ దొంగ రెచ్చిపోయాడు. ఓవ్యక్తి భార్యా బిడ్డలతో ఏటీయంలో డబ్బులు తీసుకోవడానికి వచ్చినపుడు దొంగ తుపాకీతో బెదిరిస్తూ డబ్బులు దోచుకున్నాడు. ఈఘటన జరిగి చాాలా రోజులయ్యింది. కానీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏటీయంలోకి చొరబడిన దొంగ ఆ వ్యక్తి భార్యాబిడ్డలకు గన్ గురిపెట్టి ఏటీయంలోంచి డబ్బులు తియ్యు లేకపోతే నీ భార్యా, బిడ్డల్ను చంపేస్తాను అని బెదిరించాడు. అంతేకాదు అతని పర్సులో ఉన్న డబ్బును కూడా లాక్కొన్నాడు.
#WATCH | Shocking visuals from Madhya Pradesh. Man robbed at gunpoint inside an ATM. No security guard was present outside. pic.twitter.com/NEffE6K7sj
— News18 (@CNNnews18) January 31, 2018
ఆ తర్వాత అక్కడినుంచి పరారయ్యాడు. ఈ ఘటన ఏటీయంలో ఉన్న సీసీ టీవీలో రికార్డ్ అయ్యింది. ఆ వ్యక్తి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు సీసీటీవీ పుటేజ్ ఆధారంగా దొంగను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఏటీయం దగ్గర సెక్యూరిటీ కూడా లేకపోవడంతో దొంగ పని ఇంకా సులభమయ్యింది.