అట్లాంటిక్ మహాసముద్రంలో ఘోరం జరిగింది. 4 వేల ఖరీదైన కార్లతో జర్మనీ నుంచి బయలుదేరిన ఓ భారీ సరుకు రవాణా నౌక దగ్ధమైంది. ఈ ఘటనలో 4 వేల కార్లు కాలిబుడిదైయ్యాయి. వాటి విలువ దాదాపు 39 వేల కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఫిబ్రవరి 23న అమెరికాలోని డెవిస్విల్లే తీరాన్ని చేరుకోవాల్సి ఉండగా, ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అందులో ప్రయాణిస్తున్న 22 మంది ప్రాణాలతో బయటపడ్డారు.
వివరాల్లోకి వెళ్తే.. గతకొన్ని నెలల క్రితం ‘పోర్షే, బెంట్లీ, ఆడీ, లంబోర్గిని’ వంటి ఖరీదైన కార్లతో జర్మనీ నుంచి’ఫెలిసిటీ ఏస్’అనే భారీ సరుకు రవాణా నౌక బయలుదేరింది. ఈ నౌక ఫిబ్రవరి 23న అమెరికాలోని డెవిస్విల్లే తీరాన్ని చేరుకోవాల్సి ఉండగా, అట్లాంటిక్ మహాసముద్రంలో అగ్ని ప్రమాదానికి గురైంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 4వేల కార్లు దగ్ధమైయ్యాయి.
పోర్చుగల్కు చెందిన టెరాసిరీ ద్వీపానికి 200 మైళ్ల దూరంలో ఉంది. మూడు ఫుట్బాల్ స్టేడియాల పరిమాణంలో ఉన్న ఈ నౌకలో అంటుకున్న మంటలను అదుపు చేసేందుకు సిబ్బంది ఎన్ని ప్రయత్నాలు చేసిన ఫలించలేదు. అయితే, నౌకలోని 22 మందిని మాత్రం కాపాడగలిగారు. రెండు వారాల పాటు మండిన ఈ నౌక మంగళవారం సముద్రంలో మునిగిపోయింది.