బంగారం ధర పరుగులు పెడుతోంది. స్టాక్ మార్కెట్ పరిమాణాలతో సంబంధం లేకుండా రోజురోజూకు పైకి వెళ్లిపోతోంది. కోవిడ్ కేసుల వ్యాప్తి, ప్రపంచం మళ్లీ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటున్న పరిణామాల నేపథ్యంలో మదుపర్లు బంగారాన్ని సురక్షిత పెట్టుబడి సాధనంగా భావిస్తున్నారు. ఫలితంగా బంగారంతోపాటు వెండి ధరలు కూడా పెరిగిపోతున్నాయి. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే పసిడి ధరలు రూ. 7 వేల నుంచి 8 వేలు పెరిగాయి. ఇదే ట్రెండ్ కొనసాగితే ఈ ఏడాది చివరికి నిపుణులు ఊహించినట్లు 24 కేరట్ల బంగారం రూ. 60 వేలకు, 22 కేరట్ల బంగారం రూ. 55 వేలకు చేరుకోవడం ఖాయం.
హైదరాబాద్ మార్కెట్లో సోమవారం 22 కేరట్ల బంగారం ధర పది గ్రాములకు రూ. 300 పెరిగి రూ. 51,300 నుంచి రూ. పెరిగి రూ. 51,600 వద్ద స్థిరపడింది. 24 కేరట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 55,960 నుంచి రూ. 330 పెరిగి రూ. 56,290కి చేరుకుంది. మరోపక్క వెండి ధర కాస్త పైకి ఎగబాకింది. కేజీకి రూ. 500 పెరిగి రూ. 74,900కు చేరుకుంది. దసరా, దీపావళి పండగల్లో బంగారం, వెండి ధరలు కాస్తా పెరిగి మళ్లీ తగ్గాయి. ప్రస్తుతం క్రిస్మస్, న్యూ ఇయిర్ వేడుకల నేపథ్యంలో మళ్లీ పరుగు అందుకున్నాయి.