Home > Featured > ఆర్టీసీ బస్సుల్లో స్నాక్ బాక్స్.. తక్కువ ధరకే అందుబాటులో

ఆర్టీసీ బస్సుల్లో స్నాక్ బాక్స్.. తక్కువ ధరకే అందుబాటులో

TSRTC introduces ‘Snack Box’ to distant Ac Bus travellers

నష్టాల్లో ఉన్న టీఎస్ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు ఎండీ సజ్జనార్ రూపకల్పనలు చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా కొత్త కొత్త ఆలోచనలు, కార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా మరో ఆలోచనతో ముందుకు వచ్చారు. ఇప్పటివరకు ఏసీ బస్సుల్లో ప్రయాణించే వాళ్లకు చిన్న వాటర్ బాటిల్స్ అందించేవాళ్లు. ఇకనుంచి వాటర్ బాటిల్తో పాటు స్నాక్స్ కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల ఆకలి తీర్చెందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్ట్గా హైదరాబాద్- విజయవాడ రూట్లలో తిరిగే ఎలక్ట్రిక్ గరుడ బస్సుల్లో స్నాక్ బాక్స్ విధానాన్ని అమలు చేయనున్నారు. ప్రయాణికుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని.. తర్వాత మిగిలిన బస్సుల్లో ఇప్లిమెంట్ చేయనున్నారు అధికారులు. ఈ స్నాక్ బాక్స్లో స్ప్రౌట్స్తో పాటు కారా, పల్లిపట్టీ, మౌత్ ఫ్రెషనర్, టిష్యూ పేపర్లను అమ్మనున్నారు. అయితే, వీటి కొనుగోలు కోసం టికెట్ రేటులోనే రూ. 30 నామమాత్రపు ధరను ఆర్టీసీ నిర్ణయించింది.

2023 సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచడలో టీఎస్ఆర్టీసీ సహకరించేందుకు స్నాక్ బాక్స్ను తీసుకొచ్చినట్లు ఎండీ సజ్జనార్ తెలిపారు.

Updated : 27 May 2023 5:25 AM GMT
Tags:    
Next Story
Share it
Top