తెలంగాణ ఆర్టీసీకి తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. ఏపీ తరహాలో తెలంగాణ ఆర్టీసీకి కూడా రోజుకు వెయ్యి శ్రీవారి రూ.300 దర్శన టికెట్ల కోటాను కేటాయించాలని కీలక నిర్ణయం తీసుకుంది. టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ చేసిన విజ్ఞప్తి మేరకు టీటీడీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా తెలంగాణ డిపోల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సుల్లో టికెట్తో తిరుమల దర్శన టోకెన్లను కలిపి జారీచేసే విషయమై నాగర్కర్నూల్ డీవీఎం రాము మంగళవారం తిరుపతి వచ్చారు. సెంట్రల్ బస్ స్టేషన్లోని రిజర్వేషన్ కౌంటర్కు వెళ్లి.. ఏపీలో అమలవుతున్న శ్రీవారి దర్శన టికెట్ల కేటాయింపు విధానంపై సంబంధిత అధికారులతో చర్చించారు.
టీటీడీ ఈడీపీ విభాగాన్ని సంప్రదించి దర్శన టికెట్ల కేటాయింపు సాఫ్ట్వేర్ను ఇవ్వాలని కోరారు. అందుకు సానుకూలంగా స్పందించిన ఆ విభాగం ఆర్డర్స్ కాపీని పరిశీలించి సాఫ్ట్వేర్ ఇవ్వడానికి అంగీకరించారు. ఈ క్రమంలో త్వరలోనే తెలంగాణ ఆర్టీసీకి వెయ్యి శ్రీవారి రూ.300 దర్శన టికెట్లను టీటీడీ కేటాయించనుంది. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్న భక్తులు.. ప్రయాణానికి రెండ్రోజుల ముందుగా ఈ దర్శన టికెట్లను టీఎస్ఆర్టీసీ వెబ్సైట్ లేదా సంబంధిత డీలర్ల ద్వారా బుక్ చేసుకోవాలి.