16 ఏండ్ల వయస్సులో తొలిసారిగా పెళ్లి చేసుకున్న ఆ వ్యక్తి.. సంసార జీవితానికి అలవాటు పడి కొత్తదనం కోసం మరో 11 మందిని పెళ్లి చేసుకున్నాడు. అలా 12 మంది భార్యలతో సంతానాన్ని పెంచాడు. ఎంతలా అంటే తన సంపాదన కుటుంబ పోషణకు సరిపోనంతగా. చివరకు ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు. అతడి నిర్ణయాన్ని విని.. ఇప్పుడేం లాభం అంటున్నారు స్థానికులు. ఉగాండాకు చెందిన ముస హసహ్య(67) అనే వ్యక్తికి.. 12 భార్యలు, 102 మంది సంతానం. మొదటిసారి 19 ఏండ్లకే తండ్రి అయ్యాడు. అతడి తొలిసంతానం కూతురు. గ్రామ చైర్పర్సన్ అయిన ముస, వ్యాపారవేత్త కూడా. తనకు డబ్బు, భూమి ఉన్నందున కుటుంబాన్ని పెంచుకోవాలని అనుకున్నాడట. అందుకే ఎక్కువ మంది భార్యల్ని చేసుకున్నట్లు తెలిపాడు.
భార్యలు పెరిగారు. ఫలితంగా సంతానం కూడా పెరిగింది. మొత్తం 102 మంది. ఈ క్రమంలో ఓ సంచలన ప్రకటన చేశాడు ముస. ఇక తాను పిల్లల్ని కనబోనని ప్రకటించాడు. తన భార్యలు పిల్లలు పుట్టకుండా ప్రస్తుతం మందులు వాడుతున్నారని, ఇకపై పిల్లల్ని కనబోనని ప్రకటించేశాడు. కుటుంబ పోషణకు తన ఆదాయం సరిపోవడం లేదట. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. ఈ విషయమై అతడు మీడియాతో మాట్లాడుతూ ‘‘నా దగ్గర ఉన్న పరిమిత వనరుల కారణంగా కుటుంబ మరింత విస్తృతమైతే మరింత భారం అవుతుంది. అందుకే ఇకపై పిల్లల్ని కనకూడదని నిర్ణయం తీసుకున్నాను. నా భార్యలకు ఇదే విషయాన్ని స్పష్టం చేశాను. వాళ్లు ఇందుకు ఒప్పుకున్నారు. ప్రస్తుతం వాళ్లు పిల్లలు కాకుండా మందులు వాడుతున్నారు’’ అని తెలిపాడు.
అతడి ప్రకటన విని ఇప్పటికైనా మంచి నిర్ణయం తీసుకున్నారని కొందరు అంటుండగా, వంద మంది పిల్లల్ని కన్నాక ఈ ఆలోచన రావడం గమనార్హం అంటూ సెటైర్లు వేస్తున్నారు. ముసాకు 568 మంది మనవలు, మనవరాళ్లు ఉన్నారు. ఉగాండాలోని బుగిసాలో అతడికి 12 బెడ్రూంలు ఉన్న ఇళ్లు ఉంది. అయితే తన మనవలు, మనవరాళ్లు అందరి పేర్లు తెలియవని ముసా చెబుతున్నాడు.
ఇవి కూడా చదవండి :
కన్నతల్లి కడసారి కోరిక.. ఐసీయూ వార్డులోనే కూతురి పెళ్లి..
సల్మాన్ ఖాన్ పుట్టిన రోజు వేడుకల్లో షారూఖ్ ఖాన్ సందడి..వీడియో వైరల్