ఉక్రెయిన్ ఎంపీ వాడిమ్ హలీచుక్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. మోదీ ‘ఇది యుద్ధ యుగం కాదు’ అన్న మాటలకు మేము కృతజ్ఞులమని ఆయన అన్నారు. ఆర్థికంగా, రాజకీయంగా, సైనికపరంగా భారతదేశం బలం, సామర్థ్యాలను పరిగణనలోకి తీసుకుంటే, రష్యా ఈ సందేశాన్ని వినవలసి ఉంటుందని మేము ఖచ్చితంగా అనుకుంటున్నామన్నారు. సెప్టెంబర్ 16న సమర్ కండ్ లో జరిగిన SCOశిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ నేటి యుగం యుద్ధం కాదన్నారు. ఆ సమయంలోనే ఆహారం, ఇంధనం,భద్రత,ఎరువుల సమస్యలను పరిష్కరించడానికి మార్గాలను కొనుగొనవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు.
బుధవారం వార్తా సంస్థ ANIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో హలైచుక్ ఈ వ్యాఖ్యలు చేశారు. హలైచుక్ మాట్లాడుతూ దురదృష్టవశాత్తూ, వారు (రష్యన్లు) ఏ విధమైన అవగాహనను చూపించలేదు, కాబట్టి ఆ సందేశం పునరావృతమవుతుందని మేము ఆశిస్తున్నాము, యుద్ధాన్ని కొనసాగించడానికి వారికి ఎటువంటి మద్దతు లేదని రష్యన్లకు స్పష్టంగా తెలుస్తుంది,” అన్నారాయన.
We are grateful to the phrase of PM Modi "This is not an era of war". Given the weight and capabilities of India economically, politically & militarily, we are absolutely sure that Russia would have to listen to that message: Vadym Halaichuk, Ukrainian MP (22.02) pic.twitter.com/Z6gxGt5Duk
— ANI (@ANI) February 22, 2023
త్వరలోనే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఏడాది పూర్తి చేసుకోనున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికీ రెండు దేశాలు సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నాయి. ఫిబ్రవరి 24, 2022న రష్యా తన ప్రత్యేక సైనిక చర్యను ఉక్రెయిన్లో ప్రారంభించిన సమయాన్ని హలైచుక్ గుర్తుచేసుకున్నాడు. రష్యా చర్యలకు ఉక్రెయిన్ భయపడటం లేదని “ఉక్రెయిన్ ఇప్పుడు బలంగా ఉంది” అని ఆయన అన్నారు.
“అంతర్జాతీయ సమాజం సహాయంతో, మేము దురాక్రమణదారుతో పోరాడాలి. దాడిని నిలిపివేయడంలో రష్యా ఎలాంటి సీరియస్నెస్ని ప్రదర్శించిందని మేము నమ్మడం లేదు. కాల్పుల విరమణ గురించి ప్రస్తుతం చర్చలు లేవు, ఎందుకంటే తీవ్రమైన చర్చల కోసం రష్యా వైపు ఎలాంటి కోరికను మేము చూడలేదు, ”అని ఉక్రేనియన్ ఎంపీ చెప్పారు.
ఇదిలా ఉండగా, సోమవారం ఉక్రెయిన్లో ఉక్రెయిన్ అధ్యక్షుడి కార్యాలయ అధిపతి ఆండ్రీ యెర్మాక్, భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ కుమార్ దోవల్ ఉక్రెయిన్ శాంతి ప్రణాళికపై చర్చించారు. ఇది పది పాయింట్ల శాంతి ఫార్ములా ప్రశ్నకు సమగ్ర సమాధానాలను అందిస్తుంది. యుద్ధాన్ని స్థిరంగా, న్యాయబద్ధంగా ముగించడానికి ఏమి చేయాలన్న అంశాలపై చర్చించారు.