శ్రీలంక దేశంలో నెలకొన్న ఆర్ధిక సంక్షోభం కారణంగా ఆ దేశ ప్రజలు, విద్యార్థులు గతకొన్ని నెలలుగా తీవ్రమైన ఆందోళనలు, నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే. శ్రీలంక అధ్యక్షుడు రాజీనామా చేయాలంటూ, గతవారం రోజులుగా ఆందోళనకారులు బీభత్సం సృష్టించారు. అధ్యక్ష భవనంలోకి చొరబడి నిరసనకారులు నానా రచ్చ చేశారు. దాంతో అధ్యక్షుడు గొటబాయి రాజకప్స తన భార్య, మరో ఇద్దరు అంగరక్షకులతో కలిసి దేశం విడిచి వాయుసేన విమానంలో మాల్దీవుల రాజధాని మాలేకు పారిపోయారు. అనంతరం తన అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
High Commissioner called on Hon’ble Speaker today morning. Appreciated Parliament's role in upholding democracy and Constitutional framework, especially at this crucial juncture. Conveyed that 🇮🇳 will continue to be supportive of democracy, stability and economic recovery in 🇱🇰. pic.twitter.com/apXeVWCnMA
— India in Sri Lanka (@IndiainSL) July 16, 2022
ఈ క్రమంలో తీవ్ర సంక్షోభంలో చిక్కుకుని విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటోన్న శ్రీలంకకు భారత ప్రభుత్వం అండగా ఉండాలని కొలంబోలో ఉన్న భారత హైకమిషనర్ను శ్రీలంక పార్లమెంట్ స్పీకర్ శనివారం ఉదయం కోరారు. వెంటనే స్పందించిన భారత హైకమిషనర్..శ్రీలంక ఆర్థికంగా కోలుకునేందుకు, దేశంలో స్థిరత్వం నెలకొనేవరకు భారత్ సహాయం చేస్తూనే ఉంటుందని హామీ ఇచ్చారు.
మరోపక్క శ్రీలంక అధ్యక్ష పదవికి గొటబయ రాజీనామ చేయడంతో తాత్కాలిక అధ్యక్షునిగా ప్రధాని రణిల్ విక్రమ సింఘే బాధ్యతలు చేపట్టారు. ఆ మరునాడే ఈ సమావేశం జరిగింది. సమావేశంలో శ్రీలంకకు భారత్ అండగా ఉండాలని భారత హైకమిషర్ను కోరడంతో, ఆయన హామీని ఇచ్చారు. అనంతరం ఆ విషయాన్ని కొలంబోలో ఉన్న భారత హైకమిషన్ కార్యాలయం ట్విట్ చేసింది.